సీపీఐలో పల్లాకు పెద్దపీట – జాతీయ కార్యదర్శిగా అత్యున్నత అవకాశం

సహనం వందే, హైదరాబాద్:చండీగఢ్‌లో జరిగిన సీపీఐ జాతీయ 25వ మహాసభల్లో తెలంగాణ రాష్ట్రానికి సముచిత స్థానం లభించింది. సీపీఐ జాతీయ కార్యదర్శివర్గంలో తెలంగాణ నుంచి పల్లా వెంకట్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్ పాషా తప్పుకోవడంతో… నల్లగొండ నేత పల్లాకు జాతీయస్థాయిలో అత్యున్నత పదవి దక్కింది. దీంతో తెలంగాణకు చెందిన పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐఎస్ఎఫ్ నుంచి జాతీయ కార్యదర్శి వరకు…నల్లగొండ జిల్లాకు చెందిన పల్లా…

Read More

డొనేషన్ల అడ్మిషన్… నోటీసుల పరేషాన్ – ఇంజనీరింగ్ కాలేజీల ఇష్టారాజ్యంగా దందా

సహనం వందే, హైదరాబాద్:ఎప్పుడో పది ఇరవై సంవత్సరాల క్రితం ఇంజనీరింగ్ సీటు అంటే మెరిట్, ప్రవేశ పరీక్షల ర్యాంకుల మీద ఆధారపడి ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని అగ్రశ్రేణి కాలేజీలు విద్యను వ్యాపార వస్తువుగా మార్చేశాయి. ఈ అక్రమాలకు పరాకాష్ఠగా ఇటీవల జరిగిన అడ్డగోలు యాజమాన్య కోటా సీట్ల అమ్మకాలు నిలిచాయి. నిబంధనలకు తిలోదకాలిచ్చి విద్యార్థుల మెరిట్‌ను పక్కకు పెట్టాయి. లక్షలకు లక్షలు డొనేషన్ల…

Read More

రోడ్డుపై ‘వందే భారత్’ – హైదరాబాదు నుంచి విశాఖకు 8 గంటలే

సహనం వందే, హైదరాబాద్:వందే భారత్ రైల్లో హైదరాబాదు నుంచి విశాఖపట్నం వెళ్లడానికి ఎనిమిదిన్నర గంటల సమయం పడుతుంది.‌ మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరితే రాత్రి 11:35 గంటలకు చేరుస్తుంది. ఇప్పుడు వందే భారత్ కు దీటుగా రోడ్డు పైనే కారు లేదా బస్సులో విశాఖకు చేరుకోవచ్చు. అందుకోసం వచ్చే సంక్రాంతి నుంచి కొత్త రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ – విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం తగ్గబోతోందని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రయాణికులకు ఇది నిజంగా ఓ మంచి…

Read More

‘షీ’ని వదిలేసిన ‘టీమ్స్’ – షీ టీమ్స్ ఉన్నా మహిళల భద్రత సున్నా

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. నగర శివారులోని రాజేంద్రనగర్‌లో జరిగిన దారుణ ఘటన నగర ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. కనీసం మానవత్వం కూడా లేకుండా కొందరు మృగాలుగా మారి ఒక మహిళను అత్యంత క్రూరంగా హతమార్చారు. ఈ ఘటన సమాజాన్ని కలవరపెట్టడంతోపాటు పోలీసుల పనితీరుపై కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. షీ టీమ్స్ ఏర్పాటు చేసినప్పటికీ మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. ఘోరాలు జరిగిన తర్వాత నిందితులను పట్టుకోవడమే తమ గొప్పతనంగా…

Read More

తల తిరుగుడు… బ్యాలెన్స్ తప్పుడు – అకస్మాత్తుగా కళ్లు తిరుగుతున్నాయా?

సహనం వందే, హైదరాబాద్:మీరు వాహనం నడిపేటప్పుడు ఒక్కసారిగా కళ్లు తిరిగినట్టుగా అనిపించిందా? కారు అదుపు తప్పి ఏదో ఒక వైపు వెళ్లినట్లుగా అనిపించిందా? స్టీరింగ్ మీద పట్టు కోల్పోయి ప్రమాదానికి గురైనప్పటికీ మీకు ఏం జరిగిందో అర్థం కాలేదా? ఇలాంటి సమస్యలు ఎదురైతే అది కేవలం అలసటనో, నిద్రలేమినో అనుకోవడానికి లేదు. మీ మెదడులోని సమతుల్యత (బ్యాలెన్స్) వ్యవస్థలో ఏదో లోపం ఉండవచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీన్నే ‘మోటరిస్ట్ వెస్టిబ్యులర్ డిస్ఓరియంటేషన్ సిండ్రోమ్’ అని పిలుస్తారు….

Read More

సుబ్బిరామిరెడ్డి… రూ. 5,700 కోట్ల లూటీ – మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకున్న బ్యాంకులు

సహనం వందే, హైదరాబాద్:సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు టి.సుబ్బిరామిరెడ్డి తీసుకున్న వేల కోట్ల రూపాయల రుణాలను బ్యాంకులు రద్దు చేశాయి. ఆయన కుటుంబానికి చెందిన గాయత్రి ప్రాజెక్టు కంపెనీ దివాలా తీసిందన్న సాకుతో ఏకంగా రూ. 5,700 కోట్లను మాఫీ చేయడం సంచలనం సృష్టిస్తుంది. ఈ సంఘటన రాజకీయ నేతల అవినీతికి పరాకాష్ట. బ్యాంకులు కూడా ఆయనకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సుబ్బిరామిరెడ్డి కంపెనీ రూ. 8,100 కోట్లకు పైగా తీసుకున్న రుణంలో…

Read More

మాజీ సీఎంల మూగ నోము – అసెంబ్లీకి రాకుండా జగన్, కేసీఆర్ సాకులు

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్… ఇద్దరూ ఒకే స్టైల్ రాజకీయాలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్లడానికి వీరిద్దరూ విముఖత చూపటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎదుర్కోలేక గైర్హాజరు అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కీలక స్థానంలో ఉన్న ఈ ఇద్దరు ప్రజల పక్షాన అసెంబ్లీ వేదికగా ఎందుకు పోరాడడం లేదని ప్రశ్నిస్తున్నారు. వీళ్ళని గెలిపిస్తే తమకు ఒరిగిందేంటని నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి పదవి ఉంటే తప్పా…

Read More

పట్టుచీరతో రాజకీయ ఎత్తు’గడ(ల)’ – బతుకమ్మ నీడలో పునః ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్:కొన్నాళ్లుగా కనుమరుగైన ప్రజారోగ్య మాజీ సంచాలకులు డాక్టర్ గడల శ్రీనివాసరావు మళ్లీ తెరపైకి వచ్చారు. ఈనెల 21వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొత్తగూడెంలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఎంపికైన బతుకమ్మలు పేర్చిన మహిళలకు రోజుకొకరికి పట్టుచీర గిఫ్ట్ ఇస్తానని ప్రకటించారు. తద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి అన్ని రకాలుగా ప్రజల్లో ఉండేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కింగ్…గత ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖలో…

Read More

తాత్కాలిక బదిలీల తిరకాసు – ఉద్యోగుల బదిలీలకు కఠిన నిబంధనలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లపై జారీ చేసిన మార్గదర్శకాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కన్నా నిరాశనే మిగుల్చుతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలు ఉద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతోంది. కఠినమైన అర్హతా నిబంధనలు, పరిమిత కాలపరిమితి, ఆర్థిక ప్రయోజనాల లేమి వంటివి ఉద్యోగుల మధ్య అసంతృప్తిని పెంచుతున్నాయి. అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ…ప్రభుత్వం తాత్కాలిక బదిలీల కోసం…

Read More

హుస్సేన్‌సాగర్ నీటిపై క్రికెట్ స్టేడియం

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విశ్వనగరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరిన్ని కొత్త హంగులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. హుస్సేన్‌సాగర్‌ నీటిపై ఫ్లోటింగ్ గ్రౌండ్స్ (తేలియాడే మైదానాలు) ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీంతో పర్యాటక రంగం మరింత పుంజుకుంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే హైదరాబాద్ వాసులు నీటిపైనే ఫుట్‌బాల్, బాక్స్ క్రికెట్ వంటి క్రీడలు ఆడుకునే అరుదైన అవకాశం దక్కుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి సింగపూర్ వంటి విదేశాల్లోనే…

Read More