Maoist

మావోయిజంలో ఎండమావులు – తుపాకీ గొట్టంతోనే మార్పు అంటూ స్లో’గన్’

సహనం వందే, హైదరాబాద్: అడవి బాట పడితే అద్భుతాలు జరుగుతాయని కొందరు నమ్ముతారు. తుపాకీ పడితేనే సమాజంలో మార్పు వస్తుందని భావిస్తారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయి. లొంగిపోయిన మావోయిస్టుల అనుభవాల ద్వారా వారి జీవితాల్లోని అసలు నిజాలు విస్మయం కలిగిస్తున్నాయి. ఆదర్శాల ముసుగులో అన్యాయంమావోయిస్టు ఉద్యమం ఆరంభంలో గొప్ప ఆదర్శాలతో మొదలైంది. పేదల సంక్షేమమే ధ్యేయంగా అడవి బాట పట్టారు. కానీ కాలక్రమేణా ఆ లక్ష్యాలు పక్కకు వెళ్లాయి. సాధారణ ప్రజలను రక్షించాల్సిన…

Read More
Govt.Doctors Dharna

తెల్లకోటుకు గడ్డుకాలం – అందని జీతాలు… రోడ్డునపడ్డ బతుకులు

సహనం వందే, హైదరాబాద్: రోగులకు ప్రాణం పోసే వైద్యుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల నిర్లక్ష్యం దెబ్బకు తెలంగాణ గడ్డపై వైద్య వ్యవస్థ కునారిల్లుతోంది. అహోరాత్రులు శ్రమిస్తున్నా అందని జీతాలు… పదోన్నతులు లేని సర్వీసులతో డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ దుస్థితిపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం సమరశంఖం పూరించింది. ఈ మేరకు శనివారం వైద్య విధాన పరిషత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. జీతాల కోసం నిరీక్షణతెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలో…

Read More
Outsourcing employees

వెట్టికి వెల లేదు… చాకిరికి విలువ లేదు – ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల బతుకు దయనీయం

సహనం వందే, హైదరాబాద్: అనేక ప్రభుత్వ శాఖల్లో కీలకమైన పనులన్నీ భుజాన వేసుకుని నడిపిస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస ప్రయోజనాలు అందక ఏజెన్సీల దోపిడీకి గురవుతూ వారు మానసిక వేదన అనుభవిస్తున్నారు. ఈ వెతలపై ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ నిర్వహించిన పోలింగ్ లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి. సగం మందికి పైగా వేతన వివక్ష…ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్లో సగం మంది తీవ్రమైన వేతన…

Read More
Serious Action on Fake Medicine - IMA

నకిలీ వైద్యంపై ఐఎంఏ ఉక్కుపాదం – రాష్ట్రస్థాయిలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు

సహనం వందే, హైదరాబాద్: వైద్య రంగం నేడు కనీవినీ ఎరుగని కొత్త సవాళ్లను ఎదుర్కొంటోంది. ఒకవైపు ఆసుపత్రులపై నిబంధనల సంకెళ్లు. మరోవైపు అకారణంగా వైద్య సిబ్బందిపై జరుగుతున్న దాడులు. పల్లెల్లో నకిలీ వైద్యుల ప్రాణసంకటం. ఈ గడ్డు పరిస్థితుల్లో వైద్యుల పక్షాన నిలిచి పోరాడేందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలంగాణ రాష్ట్ర యాక్షన్ కమిటీ కదనరంగంలోకి దూకింది. వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు నడుం బిగించిందని గాంధీ ఆసుపత్రి ప్రొఫెసర్ కిరణ్ మాదల ఒక ప్రకటనలో…

Read More
Shivaji Comments on Women Dressing

శివాజీకి చెంపచెళ్లు – బూతు పురాణంపై మహిళ కమిషన్ కొరడా

సహనం వందే, హైదరాబాద్: ఒకప్పుడు సినీ నటుడిగా వెలిగి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం తహతహలాడుతున్న శివాజీకి ఊహించని దెబ్బ తగిలింది. సినిమా ఫంక్షన్లలో తన మార్కు మేధావి మాటలు చెప్పబోయి అడ్డంగా బుక్కయ్యారు. సంస్కారం గురించి నీతులు చెబుతూనే మహిళలను కించపరిచేలా మాట్లాడటం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా రచ్చ లేపుతోంది. చట్టం తన పని తాను చేసుకుపోతుండటంతో శివాజీ ఇరకాటంలో పడ్డారు. ధండోరా ఈవెంట్లో నోటి దురద…శివాజీ ప్రధాన పాత్రలో వస్తున్న ధండోరా సినిమా వేడుక వేదికగా…

Read More
Highest Debts - Andhra & Telangana occupies Top 10

అప్పులు బిల్డప్పులు – టాప్10లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో కళకళలాడిన రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల కుప్పగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో పంచుతున్న ఉచితాలు, అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న అప్పులు గుదిబండలా మారుతున్నాయి. కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్రాల తీరు మారడం లేదు. అసలు ఏ రాష్ట్రం ఎంత అప్పులో ఉందో తెలిపే తాజా గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఏడో స్థానంలో తెలంగాణ…దేశంలో అధికారులు చేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో కేరళ మినహా దక్షిణాదికి చెందిన…

Read More
Celebrities in Public Events

తోపులాటల్లో సెలబ్రిటీలు – నిధి అగర్వాల్, సమంతలకు చుక్కలు

సహనం వందే, హైదరాబాద్: సెలబ్రిటీలు కనిపిస్తే చాలు అభిమానులు ఎగబడటం సహజమే అయినా అది హద్దులు దాటితేనే ప్రమాదం. తాజాగా అగ్ర కథానాయిక సమంతకు హైదరాబాదులో ఎదురైన అనుభవం ఇప్పుడు సంచలనంగా మారింది. జనం మధ్య చిక్కుకుని ఆమె పడ్డ ఇబ్బంది చూస్తుంటే నగరంలో భద్రత ఏమైందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రక్షణ కరువైన వేళ భాగ్యనగరం పరువు పోతోందని విపక్షాలు సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. తోపులాటలో సమంతహైదరాబాద్ లో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన సమంతకు…

Read More
60 Lakh Voters Risk in Telangana - Chief Election Commissioner

తెలంగాణలో 35 లక్షల ఓట్ల ఊచకోత? – ఓట్ల సవరణకు ఎన్నికల కమిషన్ నిర్ణయం

సహనం వందే, హైదరాబాద్: దేశంలో ఎన్నికల నగారా మోగకముందే ఓట్ల రాజకీయం ముదిరింది. ఓటరు జాబితా సవరణ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రక్రియ పెను దుమారం రేపుతోంది. లక్షలాది మంది ఓటు హక్కును కాలరాయడం వెనుక అధికార బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేలా సాగుతున్న ఈ పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ పరిస్థితి రానుంది. తెలంగాణలో ఓట్ల వేట రాష్ట్ర పర్యటనలో ఉన్న…

Read More
Talk of the Sunday - KCR Press Meet

టాక్ ఆఫ్ ది సండే కేసీఆర్ – రెండు తెలుగు రాష్ట్రాల్లో మాజీ సీఎం సందడి

సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాజకీయాల్లో ఆదివారం అసలైన హీట్ పుట్టింది. పదేళ్ల పాటు తెలంగాణను ఏలిన కేసీఆర్… దాదాపు ఏడాది కాలం తర్వాత మళ్ళీ నోరు విప్పారు. తనదైన మార్కు విమర్శలతో అటు రేవంత్ రెడ్డిని, ఇటు చంద్రబాబును ఓ ఆట ఆడుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే భవిష్యత్ యుద్ధానికి సిద్ధమంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. సండే పొలిటికల్ మండే…కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన…

Read More
Journalists Arrests - Justice Eswaraiah comments

రాహుల్ గాంధీ… హామీ ఏమైంది? – బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేదేంటి?

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల గళం ఇప్పుడు ఢిల్లీ పీఠాన్ని కదిలిస్తోంది. ఓట్ల రాజకీయాల కోసం వాడుకుని అధికారంలోకి వచ్చాక విస్మరిస్తున్న ధోరణిపై బీసీ మేధావులు కన్నెర్ర చేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచినా ఆశించిన మార్పు రాకపోవడంపై అఖిల భారత వెనుకబడిన తరగతుల సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటికీ బీసీలకు మాత్రం…

Read More