అలహాబాద్ కోర్టు తీర్పుపై సుప్రీం స్టే

– మహిళల ‘ఛాతీని పట్టుకోవడం రేప్ కాద’న్న తీర్పు అమానవీయమంటూ వ్యాఖ్య సహనం వందే, ఢిల్లీ: మహిళల ఛాతీని పట్టుకోవడం, పైజామా లాగడం అత్యాచారం కిందకు రాదని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పును సుప్రీం కోర్టు బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ తీర్పు అమానవీయంగా, సున్నితత్వం లేకుండా ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మసీహ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. “నాలుగు నెలలు ఆలోచించి వెలువరించిన…

Read More

డిజిటల్ మోసాలపై ఉక్కుపాదం

– లక్షల సిమ్‌లు, వాట్సప్ ఖాతాలు నిషేధం – పార్లమెంట్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడి సహనం వందే, హైదరాబాద్: డిజిటల్ మోసాలను నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 7.81 లక్షల సిమ్ కార్డులు, 3,962 స్కైప్ గుర్తింపులు, 83,668 వాట్సప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ లోక్‌సభలో తెలిపారు. సైబర్ నేరస్థుల చేతుల్లోకి డబ్బు చేరకుండా నిరోధించేందుకు…

Read More

జస్టిస్ వర్మ తీర్పులపై అనుమానాలు

– న్యాయ వ్యవస్థ విశ్వసనీయతకు సవాల్ – కాంగ్రెస్ పన్ను మదింపు కేసులో తీర్పు వర్మదే సహనం వందే, ఢిల్లీ: హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు లభ్యం కావడం, ఆయన గత తీర్పులపై అనేక అనుమానాలు వ్యక్తమవుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ పరిణామం న్యాయ వ్యవస్థలో అవినీతి, అక్రమాలపై ప్రజల్లో నూతన సందేహాలను రేకెత్తిస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదులు ఇప్పటికే వర్మ తీర్పులను సమీక్షించాలని డిమాండ్ చేస్తుండగా, దేశవ్యాప్తంగా మరిన్ని కీలక కేసుల…

Read More

బీజేపీ ‘ఇఫ్తార్ దౌత్యం’

  ‘సౌగాత్-ఈ-మోదీ’తో కొత్త ఎత్తుగడ – బీహార్ ఎన్నికల వేళ ముస్లిం ఓటర్లపై వల – 32 లక్షల మందికి ఇఫ్తార్ కిట్లు పంపిణీ సహనం వందే, ఢిల్లీ: పొద్దున్నే లేస్తే ముస్లింలను పనిగట్టుకుని విమర్శించే బీజేపీ ఇప్పుడు రాజకీయ ఎత్తుగడకు తెరలేపింది. ముస్లింలకు దూరంగా ఉండే ఆ పార్టీ ఇప్పుడు వారిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు రంజాన్ సమయంలో ముస్లింలకు ప్రత్యేక వసతులు కల్పించడం పైన, ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చిపోయే వేళల్లో ప్రత్యేక…

Read More

కెమెరాలే నిరసన ప్రకటిస్తే…

సహనం వందే, న్యూఢిల్లీ: ఢిల్లీలో జర్నలిస్టులపై జరిగిన పోలీసు దాడికి నిరసనగా ఫొటో జర్నలిస్టులు పోలీసు ప్రధాన కార్యాలయం ఎదుట తమ కెమెరాలతో మౌన ప్రదర్శన నిర్వహించారు. కెమెరాలను కింద పెట్టి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో ఓ విద్యార్థి కిందపడిపోయిన సందర్భంలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ విలేఖరి అనుశ్రీ ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించబోయారు. ఇదంతా గమనించిన ఓ పోలీసు అధికారి, “ఆమె కెమెరా పగులగొట్టండి” అంటూ ఆదేశించాడు. వెంటనే…

Read More

ఎంపీల జీతాల దోపిడీ

పార్లమెంటు సభ్యులకు వేతనాలు పెంపు – 475 మంది ఎంపీలు కోటీశ్వరులు… – ఎంపీల సగటు ఆస్తి రూ. 20 కోట్లు… పెంపుపై మండిపడుతున్న జనం – హెటెరో అధినేత, ఎంపీ బండి పార్థసారథి రెడ్డి ఆస్తి రూ. 5,300 కోట్లు – మరో పార్లమెంటు సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ఆస్తి రూ. 2,577 కోట్లు సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో చట్ట సభలకు ఎన్నిక అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే. అలా కోట్లకు…

Read More

సన్‌రైజర్స్ విజయం

– రాయల్స్‌పై 44 పరుగుల తేడాతో ఘన విజయం సహనం వందే, హైదరాబాద్: ఐపీఎల్ 2025 సీజన్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ విజయంతో ఆరంభించింది. హైదరాబాద్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ కొండంత లక్ష్యఛేదనలో రాజస్థాన్ 242/6 పరుగులకు…

Read More

డీలిమిటేషన్‌పై దుష్ప్రచారం

 కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల నిజస్వరూపం బహిర్గతం – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపణ సహనం వందే, హైదరాబాద్: డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారం వారి అవకాశవాద రాజకీయాలను బట్టబయలు చేసిందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంట్ లేదా కేబినెట్‌లో ఎటువంటి చర్చ జరగనప్పటికీ, ఈ పార్టీలు దక్షిణాదికి…

Read More

దక్షిణాదిపై ఢిల్లీ కుట్ర…

  డీలిమిటేషన్ పేరుతో పెను విధ్వంసం.. – చెన్నైలో కేటీఆర్ సంచలన ఆరోపణలు! సహనం వందే, హైదరాబాద్ చెన్నై వేదికగా జరిగిన డీలిమిటేషన్ సదస్సులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలపై ఢిల్లీ కుట్ర పన్నుతోందని, ఇది కేవలం పార్లమెంటు సీట్లకు మాత్రమే పరిమితం కాదని, ఆర్థిక విధ్వంసానికి కూడా దారితీస్తుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తును నాశనం…

Read More

దక్షిణాది దెబ్బకు ఢిల్లీ పీఠాలు దద్దరిల్లాల్సిందే..

   33 శాతం సీట్ల కోసం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం.. – బీజేపీపై దక్షిణాది సీఎంల భీకర యుద్ధం… చెన్నై వేదికగా గళం – తదుపరి దక్షిణాది సీఎంల సమావేశం హైదరాబాదులో నిర్వహిస్తామని ప్రకటన సహనం వందే, హైదరాబాద్‌ లోక్‌సభ సీట్ల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు 33 శాతం సీట్లు కేటాయించాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పీఠాలను కదిలించేలా గర్జించారు. చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన ‘న్యాయమైన పునర్విభజన’ జాయింట్…

Read More