దుబాయ్ నుండి బెంగళూరుకు బంగారు యాత్ర

సహనం వందే, బెంగళూరు:కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు…

Read More

దళితులకు బడ్జెట్‌లో వాటాకు జాతీయ చట్టం

   కేంద్ర ప్రభుత్వానికి రాహుల్ గాంధీ విజ్ఞప్తి – కర్ణాటక, తెలంగాణల్లో ఇలాంటి చట్టాలు సహనం వందే, ఢిల్లీ: దళిత, గిరిజన వర్గాల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్‌లో నిర్దిష్ట వాటా కేటాయించేలా జాతీయ చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం దళిత, గిరిజన వర్గాల పరిశోధకులు, కార్యకర్తలు, సామాజిక కార్యకర్తల ప్రతినిధి బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఈ వర్గాలకు బడ్జెట్‌లో నిర్దిష్ట వాటా కేటాయించడానికి జాతీయ చట్టం తీసుకురావాలన్న…

Read More

పుల్లారెడ్డి స్వీట్స్‌ను తొక్కేసిన దాదూస్

   ఉత్తరాది చేతుల్లోకి దక్షిణాది వ్యాపార సామ్రాజ్యం – దక్షిణాదిలో ఉత్తరాది వ్యాపార వాటా 40% – హైదరాబాదులో స్వీట్స్ నుంచి బంగారం వరకు ఉత్తరాధిపత్యం – హైదరాబాద్ నుంచి మొదలు విజయవాడ, చెన్నై, బెంగుళూర్ వరకు వ్యాపార విస్తరణ సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉత్తరాది నుంచి వలస వచ్చిన మార్వాడీలు స్థానిక వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎత్తులు, జిత్తులతో స్థానిక వ్యాపారస్తులను తొక్కేస్తూ వీరు వ్యాపార రంగంలో ఆధిపత్యం సాధిస్తున్నారు. హైదరాబాద్,…

Read More

నేను యోగిని… పొలిటిషియన్ కాదు

– యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలనం సహనం వందే, లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవీ విరమణపై ఊహాగానాలు చెలరేగుతున్న తరుణంలో, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన రాజకీయ భవిష్యత్తుపై స్పష్టమైన ప్రకటన చేశారు. “నేను పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిని కాదు. నేను ఒక యోగిని” అని ఆయన స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీలో ఆయన భవిష్యత్ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారనే ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో, యోగి ఈ వ్యాఖ్యలు…

Read More

14 అంకెల సంఖ్యతో ఆరోగ్య ఖాతా

  ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తో విప్లవాత్మక మార్పులు – కాగిత రహిత ఆరోగ్య సంరక్షణకు నాంది సహనం వందే, ఢిల్లీ: భారతదేశ ఆరోగ్య రంగంలో సరికొత్త శకానికి నాంది పలుకుతూ, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఏబీడీఎం) విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇకపై రోగుల ఆరోగ్య రికార్డుల నిర్వహణ అత్యంత సులభతరం కానుంది. ఈ మేరకు 14 అంకెల ప్రత్యేక సంఖ్యతో కూడిన ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా (ఏబీహెచ్ఏ)ను ప్రభుత్వం అందుబాటులోకి…

Read More

ఢిల్లీ బీసీ గర్జనకు రాహుల్ గాంధీ

   రేపు ఢిల్లీలో బీసీల మహాధర్నా – 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధనే లక్ష్యం – తెలంగాణ నుంచి చారిత్రక పోరాటం సహనం వందే, హైదరాబాద్: ఢిల్లీలో మంగళవారం నిర్వహించే బీసీల మహాగర్జనకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ మహా ధర్నాకు రాహుల్ గాంధీ హాజరవడం దానికి రాజకీయ ప్రాముఖ్యత పెరిగింది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర…

Read More

అసెంబ్లీ సీట్లు పెంచితే చాలు…

   వాటిని 153కి పెంచాలి… పార్లమెంటు స్థానాలను యథాతథంగా కొనసాగించాలి – కేంద్రానికి విన్నవిస్తూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం – పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనపై తీవ్ర అభ్యంతరం – దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించే కుట్ర జరుగుతోందని ఆరోపణ – కేంద్ర ద్వంద్వ వైఖరిని బట్టబయలు చేస్తామని హెచ్చరిక సహనం వందే, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను యధాతధంగా ఉంచాలని… అసెంబ్లీ స్థానాలను 153కు పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు…

Read More

మీ పాఠాలు మాకు అవసరం లేదు: స్టాలిన్

– యూపీ సీఎం యోగి వ్యాఖ్యలపై స్టాలిన్ ఘాటు ప్రతిస్పందన సహనం వందే, చెన్నై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తీవ్ర స్థాయిలో ప్రతిస్పందించారు. తమిళనాడు ద్విభాషా విధానం, పార్లమెంటరీ స్థానాల పునర్విభజనపై తమ రాష్ట్రం అభిప్రాయాలను వ్యక్తం చేయడం బీజేపీకి నచ్చడం లేదని స్టాలిన్ అన్నారు. తమిళనాడు ఎప్పటినుంచో హిందీని తప్పనిసరి చేయడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. ‘మేము హిందీ భాషకు వ్యతిరేకం కాదు. కానీ…

Read More

సంతోషానికి సంకెళ్లు

  కులం, మతం, అవినీతి, ఆర్థిక అసమానతలే అడ్డంకులు – ఒక శాతం ధనవంతుల చేతుల్లో 58 శాతం సంపద – సంతోష కొలమానాలను చేరుకోలేకపోతున్న భారతదేశం – ప్రపంచ సంతోష సూచికలో 118వ దేశంగా భారత్ – పాకిస్తాన్, నేపాల్ దేశాల కంటే మనమే మరింత వెనుకబాటు సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో సంతోషం కరువైంది. హాయిగా బతకడానికి అనుకూలమైన వాతావరణం లేకుండా పోతుంది. కుల, మతాల కల్లోలాలు, సామాజిక-ఆర్థిక అసమానతలు భారతదేశాన్ని సంతోష సూచికలో…

Read More

రెండు భాషలు చాలు: స్టాలిన్

– తమిళనాడులో తమిళం, ఇంగ్లీషే అధికార భాషలని స్పష్టీకరణ సహనం వందే, చెన్నై: “తమిళనాడుకు రెండు భాషలే చాలు” అంటూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. కేంద్రం హిందీని బలవంతంగా రుద్దేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఖండించిన ఆయన, తమ రాష్ట్రం ద్విభాషా విధానానికే కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. తమిళ సంస్కృతి, భాషా హక్కులను కాపాడేందుకు త్వరలో కీలక ప్రకటన చేస్తానని వెల్లడించారు. ద్విభాషా విధానమే కొనసాగుతుంది… శాసనసభలో భాషా విధానంపై జరిగిన చర్చలో స్టాలిన్…

Read More