Nellore Lady Don

గంజాయి రాణి దారుణ హత్యలు – నెల్లూరులో సీపీఎం నేతను చంపిన కసాయి

సహనం వందే, నెల్లూరు:నెల్లూరు జిల్లా కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షి అనే లేడీ డాన్ గంజాయి దందాకు అడ్డుగా వస్తున్నాడని భావించి సీపీఎం నాయకుడు కె. పెంచలయ్య (38)ను దారుణంగా హత్య చేయించింది. గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్న పెంచలయ్యపై కక్ష పెంచుకున్న ఈ ముఠా గత శుక్రవారం సాయంత్రం ఆయన్ను అడ్డగించి కత్తులతో పొడిచి చంపింది. ఈ లేడీ డాన్ దందాలకు కొంతమంది పోలీసులు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో నెల్లూరులో రౌడీయిజం, గంజాయి దందాలు…

Read More
AP Politicians' Weekend @Hyderabad

ఆదివారం ‘అమరావతి’ అనాథ – హైదరాబాదులో నేతల వీకెండ్ ఎంజాయ్

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ అంటే వారికి పీక్ అవర్స్ లో పని చేసే ఒక తాత్కాలిక కార్యాలయం మాత్రమే! వీకెండ్ వచ్చిందంటే చాలు ముఖ్యమంత్రి మొదలుకుని మంత్రులు, అత్యున్నత అధికారులు అనేకమంది హుటాహుటిన హైదరాబాద్‌కి పరిగెడుతున్నారు! ఏపీ రాజకీయాలు, పాలన ఇప్పుడు వారాంతపు షటిల్ సర్వీస్‌ల చుట్టే తిరుగుతోంది. రాజధాని ప్రాంతంలో వారాంతంలో బోసిపోయి ఉంటుంది. ప్రత్యేక విమానంలోనే పయనం…వారాంతంలో నేతలు హైదరాబాదుకు వెళ్లడం పట్ల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలను……

Read More
ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

కోర్టు హుకూం… జగన్ కదిలెన్ – ఐదేళ్లకు కోర్టు మెట్లు ఎక్కుతున్న మాజీ సీఎం

సహనం వందే, హైదరాబాద్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించలేదు. దీంతో చాలా ఏళ్ల విరామం తర్వాత గురువారం (నేడు) ఆయన హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరు కానున్నారు. సుదీర్ఘంగా బెయిల్‌పై ఉన్న జగన్… చివరిసారిగా 2020 జనవరి 10న కోర్టుకు వచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత దాదాపు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పరిపాలనా బాధ్యతలు, భద్రతా కారణాలు చూపుతూ కోర్టుకు రాకుండా…

Read More

అన్న హీరో… చెల్లి జీరో – మూడు రాష్ట్రాల ముగ్గురు చెల్లెళ్ల ఆవేదన

సహనం వందే, పాట్నా:బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో లొల్లి మొదలైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్య ఎదుర్కొంటున్న అవమానాలు, ఆమె సోదరుడు తేజస్వి యాదవ్ వర్గంపై చేసిన విమర్శలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయింది. తన కిడ్నీని అపరిశుభ్రమైనది అన్నారని రోహిణి ఆవేదన వ్యక్తం చేయడం… అటువంటివారు తమ కిడ్నీలను పేదలకు దానం చేయాలని సవాల్ విసరడం రాజకీయాల్లో ప్రకంపనలు లేపుతుంది. ఈ…

Read More

ఆంధ్రప్రదేశ్ ‘ముఖ్య’-మంత్రి – ప్రభుత్వంలో లోకేష్ నామజపం

సహనం వందే, అమరావతి:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు మంత్రి లోకేష్ హవా నడుస్తోంది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు అన్నిచోట్లా లోకేష్ చక్రం తిప్పుతున్నారు. అంతేకాదు పార్టీ ఎంపీలను తనతో పాటు బీహార్ కు తీసుకువెళ్లి ఎన్డీఏ కూటమికి ప్రచారం కూడా చేసి వచ్చారు. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ లో షాడో ముఖ్యమంత్రిగా లోకేష్ వ్యవహారాలను చక్కబెడుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ పైన కూడా లోకేష్ పట్టు సాధిస్తున్నారు. ఏపీ కూటమి ప్రభుత్వంలో…

Read More

జగన్ దారి తేజస్వి బికారి – ఆంధ్రప్రదేశ్ వైసీపీ పరిస్థితి బీహార్ లో రిపీట్

సహనం వందే, పాట్నా:రాజకీయాల్లో కొన్నిసార్లు ప్రజల తీర్పు ఊహించని విధంగా ఉంటుంది. అభిమానం పీక్స్ కు చేరితే ఎన్నికల ఫలితం ‘వార్ వన్ సైడ్’ వలే మారిపోతుంది. ఏడాదిన్నర క్రితం ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి తగిలిన గట్టి షాక్‌ ఇప్పుడు బీహార్‌లో రిపీట్ అయ్యింది. గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలో ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్… ఎన్డీఏ కూటమి ధాటికి కేవలం 11 సీట్లకే పరిమితమైంది. సరిగ్గా అలాంటి తీర్పు ఇప్పుడు బీహార్ ముఖ్యమంత్రి పీఠాన్ని…

Read More

కటిక నేలపై అప్పల’నాయకుడు’ – పుట్టినరోజు రాత్రి హాస్టల్లో నిద్ర

సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. ఆర్భాటం, ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వారితో పాటు భోజనం చేశారు. అంతేకాక రాత్రి విద్యార్థుల కటిక నేలపైనే నిద్రించడం విశేషం. సేవను ఒక పండుగగా భావిస్తూ పిల్లల నవ్వుల్లో…

Read More

బస్టాండ్‌ పై హెలిప్యాడ్‌ – 150 ప్లాట్‌ ఫారాలతోపాటు ఐమాక్స్‌

సహనం వందే, తిరుపతి:శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు తిరుపతి సెంట్రల్ బస్టాండ్ రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. వెంకన్న భక్తులు రోజుకు లక్షల్లో తరలివచ్చే ఈ పుణ్యక్షేత్రంలో భక్తుల రద్దీని తట్టుకునేలా 11 అంతస్తుల అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కేవలం బస్సులు నిలిపే స్థలంగా కాకుండా దివ్యక్షేత్రానికి తగిన విధంగా ఆధునిక వసతులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంకులు వంటి అన్ని సౌకర్యాలతో ఈ భవనం రూపుదిద్దుకోనుంది. ఆశ్చర్యకరంగా…

Read More

‘బాబు’ గోత్రం… కలిశెట్టి మేనల్లుడి కంఠస్థం

సహనం వందే, రణస్థలం:కలిశెట్టి అప్పలనాయుడు… విజయనగరం ఎంపీ. ఆయన స్టైలే వేరు. పార్లమెంటుకు సైకిల్ మీద వెళ్లడం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి చేదోడుగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా చంద్రబాబుకు ప్రియ శిష్యుడుగా ఉన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఏ దేవాలయంలో అర్చనలు చేసినప్పటికీ తమ కుటుంబ సభ్యుల గోత్రనామాల కంటే…

Read More

‘చేగువీర’త్వం… లోక’కళ్యాణం’ – పవన్ కళ్యాణ్ క్రేజీకి ఈ రెండే కారణం

సహనం వందే, హైదరాబాద్:తెలుగునాట పవన్ కళ్యాణ్ పేరు చెబితే చాలు యువ హృదయాలు ఉర్రూతలూగుతాయి. సినిమా తెరపై గన్ పట్టుకున్నా… రాజకీయ రణరంగంలో జనసేన జెండా ఎగరేస్తూ దూసుకెళ్లినా ఆయన పట్ల అభిమానం ఒక ఉద్వేగం. బాక్సాఫీస్ వద్ద కొన్ని సినిమాలు అనుకున్నంత విజయాలు సాధించకపోయినా… వ్యక్తిగత జీవితంలో వివాదాలు వెంటాడినా… సిద్ధాంతాల్లో మార్పులు విమర్శలకు దారితీసినా… పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమెరికాకు చెందిన ఒక…

Read More