Kalisetti Appalanaidu MP

దందా చేస్తే బొంద పెడతా – విజయనగరం ఎంపీ కలిశెట్టి హెచ్చరిక

సహనం వందే, విజయనగరం: విజయనగరం రాజకీయాల్లో కలిశెట్టి అప్పలనాయుడు ఒక ప్రత్యేక ముద్ర వేశారు. సాధారణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ లోక్ సభలో అడుగుపెట్టారు. నిరాడంబరత, నిబద్ధతే పెట్టుబడిగా ఆయన సాగిస్తున్న రాజకీయ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పదవిని బాధ్యతగా భావిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న అప్పలనాయుడుతో ‘సహనం వందే’ డిజిటల్ పేపర్ విజయనగరం ప్రతినిధి ప్రత్యేక ఇంటర్వ్యూ. సహనం వందే: ఎంపీగా ఎన్నికై ఏడాదిన్నర అయింది కదా… మీ అనుభూతి ఏంటి?అప్పలనాయుడు:…

Read More
Highest Debts - Andhra & Telangana occupies Top 10

అప్పులు బిల్డప్పులు – టాప్10లో నిలిచిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సహనం వందే, న్యూఢిల్లీ: ఒకప్పుడు మిగులు బడ్జెట్‌తో కళకళలాడిన రాష్ట్రాలు ఇప్పుడు అప్పుల కుప్పగా మారుతున్నాయి. సంక్షేమం పేరుతో పంచుతున్న ఉచితాలు, అభివృద్ధి పనుల పేరుతో చేస్తున్న అప్పులు గుదిబండలా మారుతున్నాయి. కేంద్రం హెచ్చరిస్తున్నా రాష్ట్రాల తీరు మారడం లేదు. అసలు ఏ రాష్ట్రం ఎంత అప్పులో ఉందో తెలిపే తాజా గణాంకాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి. ఏడో స్థానంలో తెలంగాణ…దేశంలో అధికారులు చేసిన టాప్ టెన్ రాష్ట్రాల్లో కేరళ మినహా దక్షిణాదికి చెందిన…

Read More
ఒకే ప్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

కటౌట్ కిక్.. పాలిటిక్స్ షేక్ – ఒకే ఫ్రేములో జగన్, కేసీఆర్, కేటీఆర్ ఫోటోలు

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. తాడేపల్లిలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన ఒక కటౌట్ ఇప్పుడు పెను సంచలనంగా మారింది. కేవలం శుభాకాంక్షలకే పరిమితం కాకుండా రాబోయే ఎన్నికల పొత్తుల వైపు ఈ ఫ్లెక్సీ సంకేతాలు పంపుతోంది. పుట్టినరోజు వేళ కొత్త రచ్చ…వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు (డిసెంబర్ 21) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ…

Read More
ఉత్తరాంధ్ర భూదందా

ఉత్తరాంధ్ర భూదందా… పవన్ పంజా! – అక్రమార్కుల గుండెల్లో డిప్యూటీ సీఎం దడ

సహనం వందే, విశాఖపట్నం: ఉత్తరాంధ్ర భూములు ఇప్పుడు రాజకీయ నేతల ఆటబొమ్మలయ్యాయి. ధరలు పెరగడంతో వివాదాలు ముదిరి హత్యల దాకా వెళ్తున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగారు. సొంత పార్టీ సహా కూటమి నేతలే ఈ దందాల్లో ఉన్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక చాలు అంటూ ఆయన హెచ్చరికలు జారీ చేయడం రాష్ట్రవ్యాప్తంగా పెను చర్చకు దారి తీసింది. పవన్ కళ్యాణ్ పవర్ వార్నింగ్రెండు రోజుల క్రితం జరిగిన కలెక్టర్ల సమావేశంలో…

Read More
రాజమండ్రి పేపర్ మిల్లులో గోల్‌మాల్

రాజమండ్రి పేపర్ మిల్లులో గోల్‌మాల్ – రిటైర్డ్ కార్మికుల సొమ్ము 4 కోట్లకు రెక్కలు

సహనం వందే, రాజమండ్రి: రిటైర్ అయ్యాక ఆసరాగా ఉంటుందని దాచుకున్న పైసలు మాయమయ్యాయి. దశాబ్దాల పాటు ఫ్యాక్టరీలో రక్తం ధారపోసి సంపాదించిన సొమ్మును సొసైటీ ముంచేసింది. ఆంధ్ర పేపర్ మిల్లు (రాజమండ్రి) రిటైర్డ్ ఉద్యోగుల బతుకులు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా కనికరించే నాథుడే కరువయ్యారు. నమ్మించి ముంచారుఆంధ్ర పేపర్ మిల్లులో 30 నుంచి 40 ఏళ్ల పాటు సేవలందించి రిటైర్ అయిన ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమకు వచ్చిన…

Read More
Termination Orders

వైద్యులపై ఉక్కుపాదం – ఏపీలో మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల తొలగింపు

సహనం వందే, విజయవాడ: ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కోట్లాది రూపాయల జీతాలు తీసుకుంటూ ఏడాదిన్నర పైగా విధులకు ఎగనామం పెడుతున్న 62 మంది వైద్య అధ్యాపకుల సేవలను తాత్కాలికంగా రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు (డీఎంఈ) జి.రఘునందన్ రావు నిర్ణయించారు. అనుమతి లేకుండా సంవత్సరానికి పైగా గైర్హాజరైన 12 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, 48 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇద్దరు ట్యూటర్లపై షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ ప్రొవిజనల్ టర్మినేషన్ ఆర్డర్లు విడుదల…

Read More
Bapatla incident

భార్య శవంతో బైకుపై పోలీస్ స్టేషన్‌కు..! – హత్య చేసి లొంగిపోయిన భర్త

సహనం వందే, బాపట్ల: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కిరాతకంగా చంపిన ఓ హంతకుడు చేసిన పని ఉలికిపాటుకు గురిచేసింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు ప్రాంతంలో భయాందోళనలు సృష్టించింది. భార్య మహాలక్ష్మిని గొంతు నులిమి హతమార్చిన భర్త వెంకటేశ్వర్లు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ఆ మృతదేహాన్ని తన బైకుపై పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. ఈ దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక మనిషి ఇంత దారుణంగా వ్యవహరించడం సమాజంలో పెరిగిపోతున్న…

Read More
Jagan Vs Sharmila

నా ఆస్తి నా ఇష్టం – షర్మిల వాటాకు జగన్ టాటా

సహనం వందే, హైదరాబాద్: తన సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు ఆస్తుల్లో వాటా ఇవ్వడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ససేమిరా అంటున్నాడు. రాజకీయంగా చెల్లెలు తనకు వ్యతిరేకంగా మారడంతో ఆమెకు ప్రేమతో ఇచ్చిన వాటాలను కూడా వెనక్కి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఎన్నోసార్లు బహిరంగంగా ప్రకటించిన జగన్… ఇప్పుడు ఏకంగా చెన్నైలోని జాతీయ కంపెనీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ)లో పిటిషన్ దాఖలు చేశారు. ఇది కేవలం ఆస్తి వివాదం కాదని… రాజకీయ వైరమే ప్రధాన కారణమని…

Read More
Thirupathi పట్టు వస్త్రాల కోట్ల స్కామ్

పట్టు వస్త్రాల కోట్ల స్కామ్ – మరోసారి తిరుమలలో పవిత్రతకు భంగం

సహనం వందే, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మరోసారి కుంభకోణాల సుడిగుండంలో చిక్కుకుంది. లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలు, పరకామణిలో చోరీ వంటి వివాదాల తర్వాత తాజాగా టీటీడీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా రూ. 55 కోట్ల విలువైన పట్టు దుపట్టా కొనుగోలు కుంభకోణం వెలుగు చూసింది. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీవారి సేవలో, ఆలయ ఉత్సవాలలో, దాతలకు వేదాశీర్వచనం సమయంలో ఉపయోగించే పవిత్రమైన పట్టు వస్త్రాల విషయంలో ఈ మోసం జరగడం భక్తుల మనోభావాలను తీవ్రంగా…

Read More
Arnav Goswamy comments Civil Aviation Minister

కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుని ఉతికిపారేసిన అర్నాబ్‌ గోస్వామి

సహనం వందే, అమరావతి: దేశంలో ఇండిగో విమానయాన సంస్థ సృష్టించిన సంక్షోభంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇంత పెద్ద సమస్య ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా, కేంద్ర మంత్రి మాత్రం కనీసం స్పందించడం లేదని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని జాతీయ మీడియా దుమ్మెత్తిపోస్తోంది. అసలు మంత్రి ఏం చేస్తున్నారంటూ… నెట్‌ ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నారా? లేక రీల్స్‌, నెట్ ఫ్లిక్స్ చూస్తున్నాడా? అంటూ రిపబ్లిక్‌ టీవీ ప్రజెంటర్‌ అర్నాబ్‌…

Read More