గంగకు గండం… నదులకు పిండం – 21 వేల నదుల్లో ఆక్సిజన్ పతనం
సహనం వందే, హైదరాబాద్: భూగోళంపై జీవనాడులుగా వెలుగొందుతున్న నదులు ఇప్పుడు నిశ్శబ్దంగా మరణిస్తున్నాయి. మనం పీల్చే గాలిలోనే కాదు… నిరంతరం ప్రవహించే నీటిలోనూ ప్రాణవాయువు వేగంగా కరిగిపోతోంది. మానవ నిర్లక్ష్యం, పారిశ్రామిక వ్యర్థాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జలవనరుల ఊపిరిని నొక్కేస్తున్నాయి. పర్యావరణాన్ని అతలాకుతలం చేస్తున్న ఈ నిశ్శబ్ద విపత్తు మానవ మనుగడకే సవాలు విసురుతోంది. నిశ్శబ్దంగా అంతరిస్తున్న ప్రాణవాయువుప్రపంచవ్యాప్తంగా ఉన్న నదుల్లో ఏకంగా 80 శాతం నదులు తమలోని ప్రాణవాయువును వేగంగా కోల్పోతున్నాయని శాస్త్రవేత్తలు తీవ్ర హెచ్చరికలు…