Putin Comments on India

‘భారత్ బ్రిటీష్ కాలనీ కాదు…’ – ఒక ప్రధాన ప్రపంచ శక్తి

సహనం వందే, న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘భారత్ టుడే‘ గ్రూప్ టీవీ ఛానళ్లకు పుతిన్ ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో… భారత్‌తో తమ సంబంధం సామాన్య స్నేహం కాదని ఇది ప్రత్యేకమైనదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీని తన దోస్త్ అని పిలుస్తూ ఆయన చాలా విశ్వసనీయ వ్యక్తి అని, భారత్‌ను గుండెల్లో పెట్టుకుని జీవిస్తారని అన్నారు. భారత్ బ్రిటిష్ కాలనీ కాదు……

Read More
Sania Mirza and with her' Son

టెన్నిస్ తూచ్… అమ్మతనమే అదుర్స్ – స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగం

సహనం వందే, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు జీవితంలోనూ విజేతగా నిలిచింది. అనేక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సానియా… కోర్టు బయట తన తల్లి అనుభవాలను పంచుకుంది. తన కొడుకు ఇజ్హాన్‌ను పెంచే క్రమంలో తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం… జీవితంలో సమతుల్యత (బ్యాలెన్స్) సాధించడమే అని ఆమె అంటున్నారు. టెన్నిస్‌లో గెలవడం మాత్రమే కాదు, జీవితపు మ్యాచ్ ప్లాన్‌లో విజయం సాధించాలంటే కుటుంబం, కెరీర్ మధ్య…

Read More
Vijayasai Reddy

కేసుల గోల… సనాతన సేవ – విజయసాయిరెడ్డి హిందుత్వ యాత్ర!

సహనం వందే, అమరావతి: మాజీ వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి వైఖరి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్సీపీలో ఉన్నప్పుడు ఏనాడూ హిందుత్వ గురించి… మత మార్పిడుల గురించి మాట్లాడని ఆయన ఇప్పుడు ఒక్కసారిగా సనాతన ధర్మ పరిరక్షకుడిలా అవతారమెత్తారు. హిందూ మతంపై కుట్రలు సహించేది లేదంటూ ఎక్స్ వేదికగా గరంగరంగా పోస్టులు పెడుతున్నారు. డబ్బు ఆశ చూపి మతం మార్చితే బుద్ధి చెబుతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మత మార్పిడులపై కేంద్రం కమిటీ…

Read More
Indigo

ఆకాశంపై ఇండిగో ఆధిపత్యం – 3 లక్షల మంది ప్రయాణాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది! డిసెంబరు ప్రారంభం నుంచే వేలాది విమానాలను రద్దు చేస్తూ అర్జెంటు పనులను… పెళ్లిళ్ల ప్రయాణాలనూ పూర్తిగా నాశనం చేసింది. ఈ వారంలో ఏకంగా 2,100కు పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో 3 లక్షల మంది ప్రయాణాలు నిలిచిపోయాయి. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, ముంబై వంటి అనేక ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు కాశారు. ముందుగా ప్లాన్ చేసుకున్నవన్నీ తలకిందులవడంతో ఎంతోమంది ఆందోళన చెందారు….

Read More
Maseedu@Ayodhya

అయోధ్యలో మసీదు – రామాలయం పక్కనే నిర్మాణానికి రంగం సిద్ధం

సహనం వందే, అయోధ్య: అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగి సరిగ్గా 33 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1992 డిసెంబర్ 6న జరిగిన ఈ ఘటన దేశ రాజకీయాల్లో, మతపరమైన అంశాల్లో పెను ఉద్రిక్తతకు దారితీసింది. ఆ వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు దివ్యమైన రామాలయ నిర్మాణం పూర్తయి ఇప్పుడు అక్కడ ప్రార్థనలు జరుగుతున్నాయి. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆదేశాల మేరకు కేటాయించిన స్థలంలో కొత్త మసీదు నిర్మాణం కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఇది…

Read More
Dr.Raghuram

డాక్టర్ రఘురామ్‌ కు అంతర్జాతీయ గౌరవం – రాయల్ కాలేజ్ గవర్నింగ్ కౌన్సిల్‌కు ఎన్నిక

సహనం వందే, హైదరాబాద్: దేశ వైద్య రంగానికి దక్కిన చారిత్రక గౌరవం ఇది. 425 ఏళ్ల చరిత్ర కలిగిన, ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో గవర్నింగ్ కౌన్సిల్‌కు భారతదేశం నుంచి ఎన్నికైన తొలి శస్త్రవైద్యుడిగా డాక్టర్ రఘురామ్‌ ఘనత సాధించారు. కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఆయన రొమ్ము క్యాన్సర్ నివారణ, చికిత్సలో అద్భుతమైన సేవలు అందించారు. డాక్టర్ రఘురామ్…

Read More
Eswara Chari Death

బీసీ బిడ్డ బలిదానం… రగులుతున్న తెలంగాణ

సహనం వందే, హైదరాబాద్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకున్న బీసీ యువకుడు సాయి ఈశ్వరాచారి చికిత్స పొందుతూ కన్నుమూయడం రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించింది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక రిజర్వేషన్లను ఏకంగా 17 శాతానికి తగ్గించడంతో బీసీ వర్గాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వం తమను మోసం…

Read More
World Population Review

అమెరికా అహంకారం… చైనా చండాలం – అగ్రరాజ్యాలను ఇష్టపడని ప్రపంచ ప్రజలు

సహనం వందే, అమెరికా: ప్రపంచంలో ఏ దేశాన్ని ప్రజలు అత్యంత ఎక్కువగా డిస్‌లైక్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకు వరల్డ్ పాపులేషన్ రివ్యూ నిర్వహించిన 2025 ప్రపంచ సర్వే షాకింగ్ సమాధానం ఇచ్చింది. ప్రపంచంలో అత్యంత ద్వేషించే దేశంగా చైనా మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్, తైవాన్‌ వంటి ప్రాంతాల స్వేచ్ఛను అణచివేయడం… ఉయ్‌ఘుర్ ముస్లింలపై దాడులు… మానవ హక్కుల ఉల్లంఘనలు… కోవిడ్ సమయంలో సమాచారాన్ని దాచిపెట్టడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది చైనాను…

Read More
Location Tracking system

లొకేషన్ ట్రాకింగ్‌ – కొత్త ఫిట్టింగ్… ప్రజల సీక్రెట్స్ విషయంలో వెనక్కుతగ్గని కేంద్రం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. మొన్నటికి మొన్న నిఘా సైబర్ సేఫ్టీ పేరుతో సంచార్‌ సాథీ యాప్‌ ను స్మార్ట్‌ఫోన్లలో ముందే ప్రీలోడ్ చేయాలని ఆదేశించింది. నిఘా, వ్యక్తిగత సమాచార చౌర్యంపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన రావడంతో ఆ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవం మర్చిపోక ముందే ఇప్పుడు ఏకంగా స్మార్ట్‌ఫోన్లలో లొకేషన్ ట్రాకింగ్‌ వ్యవస్థను ఆఫ్ చేయకుండా చూసేలా మరో కుట్ర…

Read More
400 Indigo Flights Cancelled

ఇండిగో ఇదేం రోగం? – ఈరోజు 400 విమానాలు రద్దు

సహనం వందే, హైదరాబాద్: దేశంలోని ప్రధాన విమానాశ్రయాలలో వరుసగా నాలుగో రోజు కూడా ప్రయాణికుల ఆందోళనలు ఆగడం లేదు. ఇండిగో విమానాలు ఆలస్యం కావడం… చివరి నిమిషంలో రద్దు కావడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే 400కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇది ఎంతటి దారుణమో అర్థం చేసుకోవచ్చు. దేశంలోని 6 ముఖ్య నగరాలలో గురువారం బయలుదేరిన విమానాలు కేవలం ఎనిమిదిన్నర శాతం మాత్రమే. ఇంత దారుణమైన సేవను విమానయాన సంస్థ…

Read More