హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంకు జాతీయ అవార్డు

సహనం వందే, న్యూఢిల్లీ:హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్‌పీఓ), తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 2025 ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారుల సమావేశంలో…హైదరాబాద్ ఆర్‌పీఓ చేపట్టిన వినూత్న చర్యలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాల విభాగంలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకుంది. పాస్‌పోర్ట్ ధృవీకరణ, సేవా సౌకర్యాలలో తెలంగాణ పోలీసుల నిరంతర ప్రతిభకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మంగళవారం నాడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి…

Read More

ఆంధ్రప్రదేశ్ ను అడ్డుకోండి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని తేల్చిచెప్పారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి వివరించారు.‌గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేంతవరకు ప్రజా ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే…

Read More

కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలు

సహనం వందే, హైదరాబాద్:వచ్చే నవంబర్ 9వ తేదీలోపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఇది రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో వ్యవసాయ రంగంతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి, చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలురైతులకు అండగా రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు మంత్రివర్గ సభ్యులు…

Read More

ఓజస్ తేజో ఆధ్వ‌ర్యంలో… యోగా దినోత్స‌వ వేడుకలు

సహనం వందే, హైదరాబాద్:‘ఓజస్ తేజో యోగా’ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ డీడీ కాలనీ లైబ్రరీ హాల్‌లో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ వివిధ యోగాసనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఓజస్ తేజో యోగా ఇన్‌స్టిట్యూట్ నిర్వాహకురాలు, యోగా గురువు వర్ష దేశ్‌పాండే మాట్లాడుతూ… యోగా విశిష్టతను, దైనందిన జీవితంలో దాని ప్రాముఖ్యతను వివరించారు. యోగా శారీరక,…

Read More

విద్యతో పేదరిక నిర్మూలన – వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్:విద్య ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని వాల్మీకి ఫౌండేషన్ చైర్మన్ సూర్య గణేష్ వాల్మీకి అన్నారు. శనివారం సిటీ శివారులోని డీఎంఆర్ గార్డెన్స్‌లో సంస్థ వార్షికోత్సవం ‘ఏకత్వం – మనీ హాండ్స్, వన్ మిషన్’ థీమ్‌తో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 100కు పైగా సైకిళ్లు, పుస్తకాలు, క్రీడా సామగ్రిని గ్రామీణ పిల్లలకు పంపిణీ చేశారు. ప్రత్యూష సపోర్ట్, పద్మశ్రీ డాక్టర్ మంజుల అనగని సహకారంతో 3,000 బయోడిగ్రేడబుల్ శానిటరీ ప్యాడ్‌లను హైస్కూల్ బాలికలకు అందజేశారు….

Read More

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి – టీడబ్ల్యూజేఎఫ్

కొత్త స్పెషల్ కమిషనర్‌కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సమాచార్ భవన్‌లో కొత్త స్పెషల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ అధికారి సిహెచ్. ప్రియాంకను ఫెడరేషన్ బృందం కలిసి అభినందించింది. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్యతో పాటు ఇతర ప్రతినిధులు జర్నలిస్టుల ప్రధాన సమస్యలైన అక్రిడిటేషన్లు,…

Read More

క్యాబినెట్ లో మెడికోలపై నివేదిక – మంత్రి దామోదర వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి, సిఫార్సులతో సహా చర్చించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశ ఫలితాలు, తదుపరి చర్యలను వివరించడానికి 25న టీ-జుడా ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జూడా నాయకులు డాక్టర్ ఐజాక్…

Read More

ఏలూరులో సాక్షి ఆఫీసుకు నిప్పు – రాష్ట్రవ్యాప్తంగా దాడులు

ఎడిటర్ ధనుంజయరెడ్డి, సైమాల ఖండన సహనం వందే, ఏలూరు:ఆంధ్రప్రదేశ్‌లో సాక్షికి వ్యతిరేకంగా నిరసనలు, ధర్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో మంగళవారం ఏలూరులో నిరసన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా కొందరు దుండగులు సాక్షి ఆఫీసుకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నిచర్, సోఫాలు పూర్తిగా కాలిపోగా, పార్కింగ్‌లో నిలిపి ఉంచిన కారు కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఈ దాడి టీడీపీ నేతలు కక్షపూరితంగా చేసిన పనే అని వైసీపీ ఆరోపించింది. ఈ ఘటనను సాక్షి…

Read More

డాక్టర్ రఘురామ్ కు అరుదైన గౌరవం

కేఎంసీ విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు ప్రదానం సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్‌లోని కిమ్స్-ఉషలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్ వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ పి. రఘురామ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. మంగళూరులోని కస్తూర్బా మెడికల్ కాలేజీ (కేఎంసీ) 70 ఏళ్ల చరిత్రలో విశిష్ట పూర్వ విద్యార్థుల అవార్డు పొందిన మొదటి వైద్యుడిగా ఆయన ఘనత సాధించారు. మంగళూరులో జరిగిన ప్లాటినం జూబ్లీ కళాశాల దినోత్సవ వేడుకల్లో ఈ అవార్డును డాక్టర్ రఘురామ్‌కు అందజేశారు. అత్యున్నత సేవలకు…

Read More

ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ చీఫ్ అసంతృప్తి

సహనం వందే, హైదరాబాద్: మెజారిటీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదని, వెంటనే తమ పనితీరును సరిదిద్దుకోవాలని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నెలలోనే పీసీసీ కార్యవర్గం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని స్పష్టం చేసిన ఆయన, ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాల్సిన బాధ్యత తమపైనే ఉందని స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రివ్యూ మీటింగ్‌లో మాట్లాడుతూ, పలువురు ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకపోవడంతో…

Read More