Sahanam Vande

‘పోష్ కాదు స్లేవ్స్’

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి చేసిన వివాదాస్పద, అమానవీయ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా అగ్ని రాజేశాయి. గురుకులాల్లో చదివే దళిత విద్యార్థులను పాష్ సొసైటీ నుంచి రాలేదని చులకనగా కించపరిచి, వారితో టాయిలెట్లు, గదులు శుభ్రం చేయించడాన్ని సమర్థించిన ఆమె, చివరకు పిల్లల తల్లిదండ్రులను షోకాజ్ నోటీసులతో బెదిరించిన ఆడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వ్యాఖ్యలు దళిత సమాజాన్ని అవమానించడమే కాక, ఐఏఎస్ అధికారిగా ఆమె స్థాయికే మచ్చ…

Read More

థగ్ లైఫ్ ఒక మహత్తర చిత్రం:

ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్! సహనం వందే, విశాఖపట్నం: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది….

Read More

వ్యవసాయశాఖలో ‘మావోయిస్టు’ చైర్మన్

సహనం వందే, హైదరాబాద్: వ్యవసాయ దాని అనుబంధ శాఖలకు చెందిన అనేక కార్పొరేషన్లలో ఒక కార్పొరేషన్ చైర్మన్ వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. తనకు మావోయిస్టు బ్యాక్‌గ్రౌండ్‌ ఉందని గొప్పగా చెప్పుకుంటూ… ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, ప్రతిపక్ష కేడర్, మీడియా, ప్రైవేట్ వ్యాపారులను ఆయన బహిరంగంగా బెదిరిస్తున్నట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘నేను గతంలో నక్సలైట్లలో పనిచేశా… నాకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి… నన్ను విమర్శిస్తే నా బ్యాక్‌గ్రౌండ్‌తో బయటకొస్తా… నాతో పెట్టుకుంటే ఖతమే’ అంటూ ఆయన చేస్తున్న…

Read More

దళితులపై దాష్టీకం హక్కుల ఉల్లంఘనే!

సహనం వందే, ఢిల్లీ: తెనాలిలో దళితులపై పోలీసుల దాష్టీకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తెనాలిలో ముగ్గురు దళితులను లాఠీలతో దారుణంగా హింసించి, బూటు కాలుతో తన్ని దాడి చేయడంపై హైదరాబాద్‌కు చెందిన హైకోర్ట్ న్యాయవాది సీలోజు శివకుమార్ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఢిల్లీలో కమిషన్ సభ్యురాలు విజయభారతికి వినతిపత్రం అందజేశారు. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, ఆర్టికల్…

Read More

ఎంబీబీఎస్-ఆయుర్వేద ఇంటిగ్రేటెడ్ కోర్సు

సహనం వందే, హైదరాబాద్: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోనే తొలిసారిగా ఎంబీబీఎస్, బీఏఎంఎస్ లను కలిపి ఒక ఇంటిగ్రేటెడ్ మెడికల్ కోర్సును ప్రవేశపెట్టనుంది. ఆధునిక వైద్య విజ్ఞానం, సాంప్రదాయ ఆయుర్వేద వైద్య పద్ధతులను సమన్వయం చేయడమే ఈ కోర్సు ప్రధాన లక్ష్యం. ప్రాథమిక దశలో కోర్సు…ప్రస్తుతం ఈ ఇంటిగ్రేటెడ్ కోర్సు ప్రాథమిక దశలో ఉంది. ఈ కోర్సు కోసం సరికొత్త…

Read More

కేసీఆర్ అండతో జీ’ఎస్ఆర్’

సహనం వందే, హైదరాబాద్: గడల శ్రీనివాసరావు… తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులుగా ఉన్న కాలంలో మొత్తం వ్యవస్థను తన నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ఆ విభాగాన్ని గడల సామంత రాజ్యం (జీఎస్ఆర్)గా మలుచుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అండ చూసుకొని మరీ పెచ్చుమీరిపోయారు. ఎందుకో ఏమో కానీ గడలను ఒకానొక సందర్భంలో పక్కన పెట్టాలని అనుకున్న కేసీఆర్.‌‌.. కరోనా కాలంలో అందలం ఎక్కించారు. దీంతో గడలకు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఆయన ఒక సెలబ్రిటీగా మారిపోయారు. రాష్ట్రంలో ఏ ఐఏఎస్,…

Read More

తెరపైకి మహేష్ కుమార్ గౌడ్

సహనం వందే, హైదరాబాద్: మంత్రివర్గ విస్తరణలో చోటు కోసం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కుటుంబ సభ్యులతో వెళ్లి రాహుల్ గాంధీని కలవడం చర్చనీయాంశం అయింది. బీసీగా తనకు అవకాశం కల్పించాలని ఆయన అధిష్టానాన్ని అభ్యర్థిస్తున్నారు. మహేష్ కుమార్ గౌడ్ మంత్రి అయితే నిజామాబాద్ జిల్లాకు చెందిన సుదర్శన్ రెడ్డికి అవకాశాలు సన్నగిల్లినట్లే. కాగా, కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చే ముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి…

Read More

పవన్ తో పెట్టుకుంటే పతనమే

సహనం వందే, అమరావతి/హైదరాబాద్: సినిమా పరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భగ్గుమంటున్నారు. తమ కూటమి ప్రభుత్వాన్ని లెక్కచేయకపోవడం పైన… తన సినిమా విషయంలో అడ్డువస్తున్న వారిపట్ల ఆయన మండిపడుతున్నారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు ఇతర సినీ పెద్దలపై కన్నెర చేశారు. పవన్ తో పెట్టుకుంటే ఏమవుతుందో రుచి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేశారు. సినిమా థియేటర్లలో కనీస వసతులు, వాటర్ బాటిళ్లు, ఆహార పదార్థాల ధరలపై విచారణ జరపాలని…

Read More

కరోనా శవాలపై రూ. 450 కోట్లు?

సహనం వందే, హైదరాబాద్: ఇలా తెలంగాణ రాష్ట్రంలో కరోనా కాలంలో 2020 నుంచి ప్రజారోగ్య విభాగం పరిధిలోని అనేకమంది జిల్లా వైద్యాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులపై పడి అందినంత దోచుకున్నారు. రోగులకు సాయం చేయాల్సింది పోయి యాజమాన్యానికి తొత్తులుగా మారారన్న విమర్శలు ఉన్నాయి. కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు వైద్య ఆరోగ్య శాఖలో కరోనా కాలంలో రూ.కోట్లు దండుకోవటమే పనిగా కొందరు అధికారులు వ్యవహరించారు. కరోనా చావులపై పైసలు ఏరుకున్నారు. వందల ఫిర్యాదులు… చర్యలెక్కడ?కరోనా సమయంలో…

Read More

జైలు నుంచి సీఎం

సహనం వందే, హైదరాబాద్: భారత రాజకీయాల్లో జైలు జీవితం అనేక మంది నాయకులకు అనూహ్య అవకాశాలు కల్పించింది. ఇటీవల కాలంలో జైలుకు వెళ్లి వచ్చిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుండటం గమనార్హం. రాజకీయ పోరాటాలు, అవినీతి ఆరోపణలు… కారణం ఏదైనా వారికి బ్రహ్మరథం పడుతున్నారు. జైలుకు వెళ్లడం ఒక అర్హతగా భావించేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన తర్వాత కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారని,…

Read More