అమెరికాలో రాజీవ్ హత్యకు కుట్ర – టెక్కి స్కెచ్ను మార్చిన సీఎం!
సహనం వందే, హైదరాబాద్: 1985లో భారత ప్రధాని రాజీవ్ గాంధీ అమెరికా పర్యటనను రక్తసిక్తం చేసేందుకు ఖలిస్తానీ ఉగ్రవాదులు ఒక భయంకరమైన కుట్ర చేశారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికాలో ఉంటూనే ప్రధానిని హతమార్చడానికి పెద్ద ప్లాన్ వేశాడు. అయితే అదే సమయంలో అక్కడికి వచ్చిన హర్యానా ముఖ్యమంత్రి భజన్ లాల్ను చంపేందుకే ఉగ్రవాదులు ఎక్కువ ఆసక్తి చూపించారు. దీంతో వారి శ్రద్ధ రాజీవ్ గాంధీ నుండి భజన్ లాల్ వైపు మళ్లి ప్రధానిపై జరగాల్సిన దాడి…