హైదరాబాదులో జొన్న రొట్టె జైత్రయాత్ర – పేదవాడి కూడు ఇప్పుడు గ్లోబల్ ట్రెండ్
సహనం వందే, హైదరాబాద్: బిర్యానీల నగరంలో ఇప్పుడు జొన్న రొట్టెల జాతర నడుస్తోంది. రాత్రి వేళల్లో పిజ్జాలు, ఫాస్ట్ ఫుడ్ తిని విసిగిపోయిన భాగ్యనగర వాసులు ఇప్పుడు ఆరోగ్యకరమైన సిరిధాన్యాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకప్పుడు పేదవాడి ఆహారంగా భావించిన ఈ గ్రామీణ వంటకం… ఇప్పుడు హైటెక్ సిటీ కార్పొరేట్ ఉద్యోగుల ప్లేట్లలో హాట్ కేకుల్లా మారి సరికొత్త ఆహార విప్లవాన్ని సృష్టిస్తోంది. నగరంలో మారిన ట్రెండ్హైదరాబాద్ అంటేనే బిర్యానీకి కేరాఫ్ అడ్రస్. కానీ ఐటీ కల్చర్…