శ్మశానాల వైపు విద్యార్థులు – ప్రతిరోజూ 40 మంది విద్యార్థుల ఆత్మహత్య
సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో చదువుల ఒత్తిడి విద్యార్థుల పాలిట మృత్యుపాశంగా మారుతోంది. ప్రతిరోజూ దాదాపు 40 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం దేశంలో ఒక జాతీయ అత్యవసర పరిస్థితిని తలపిస్తోంది. పుస్తకాల మోత, పరీక్షల భయం, తల్లిదండ్రుల ఆకాంక్షలు వెరసి యువత భవిష్యత్తును క్లాస్రూమ్లలోనే చిదిమేస్తున్నాయి. మరణమృదంగంభారత జాతీయ నేర రికార్డుల బ్యూరో తన 2024 నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రమాదకర మరణాలు, ఆత్మహత్యలపై అత్యంత కలచివేసే నిజాలను బయటపెట్టింది. దేశంలో ప్రతిరోజూ దాదాపు 40…