జొన్నగిరి… ‘స్వర్ణ’సిరి – కర్నూలు జిల్లాలో బంగారు గని
సహనం వందే, కర్నూలు: భారతదేశం బంగారం కోసం విదేశాల వైపు చూస్తోంది. ఏటా 750 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటూ ఖజానాను ఖాళీ చేస్తోంది. ఈ పరిస్థితిని మారుస్తూ ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరిలో సరికొత్త చరిత్ర మొదలైంది. ప్రైవేటు రంగానికి తలుపులు తెరుస్తూ నేలతల్లి గర్భంలో దాగున్న పసిడి నిక్షేపాలను వెలికితీసే ప్రయత్నం ఒక చారిత్రక ఘట్టానికి నాంది పలుకుతోంది. నేల గర్భంలో కొత్త ఆశలుదేశంలో బంగారం వాడకం చాలా ఎక్కువ. ఇతర దేశాల మీద ఆధారపడటం…