‘ఆరు’ కోసం బీజేపీ అగచాట్లు – ఆరుగురు ఎంపీల కోసం ఎన్డీఏ వేట
సహనం వందే, న్యూఢిల్లీ: పార్లమెంటులో సంఖ్యాబలమే పరమావధిగా మారిన వేళ బీజేపీ సర్కార్ అడుగులు ఉత్కంఠ రేపుతున్నాయి. వెనక్కి తగ్గేది లేదంటూ వ్యూహాలకు పదును పెడుతోంది. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ బిల్లులను ఆమోదింపజేసేందుకు అడ్డంకులను తొలగించుకునే ప్రయత్నంలో అధికార పక్షం ఉంది. గతంలో జరిగిన పరాభవానికి ఈసారి చెక్ పెట్టేందుకు సరికొత్త రాజకీయ సమీకరణాలు సిద్ధం చేస్తోంది. రాజకీయ చదరంగంలో కొత్త ఎత్తుగడపార్లమెంటు వర్షాకాల సమావేశాలు 20 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో…