ఢీకొట్టినా వెనక్కితగ్గని ‘జర్నలిజం’

సహనం వందే, బాల్టీమోర్: గుర్రపు పందేలంటే ఉత్కంఠకు కేరాఫ్ అడ్రస్. క్షణక్షణానికో మలుపు తిరిగే ఈ రేస్‌ల్లో ఒక్కోసారి ఊహించని విజయాలు నమోదవుతుంటాయి. సరిగ్గా అలాంటి సంచలనమే ఆదివారం మేరీల్యాండ్ లోని బాల్టిమోర్‌ పిమ్లికో రేస్ కోర్స్‌లో జరిగింది. 150వ ప్రీక్‌నెస్ స్టేక్స్‌లో జర్నలిజం అనే గుర్రం అద్భుతమైన కంబ్యాక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచింది. రేస్ మధ్యలో మరో గుర్రంతో ఢీకొని ట్రాక్ తప్పే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ ఈ గుర్రం, చివరి క్షణాల్లో మెరుపు వేగంతో…

Read More

’23’: తెరపై దళిత గాథ!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

Read More

హిట్లర్ నాజీ’హీరో’యిజం

సహనం వందే, హైదరాబాద్: అడాల్ఫ్ హిట్లర్… ఈ పేరు వింటేనే ప్రపంచ చరిత్రలో రక్తపు అధ్యాయం కళ్లముందు కదలాడుతుంది. రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడైన ఈ నియంత విద్వేషపూరిత భావజాలం 80 ఏళ్ల తర్వాత కూడా పూర్తిగా అంతరించలేదు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే కొన్ని దేశాల్లో నియో-నాజీలు కేవలం రహస్యంగానే కాకుండా, రాజకీయ పార్టీల రూపంలోనూ ఉనికిని చాటుకుంటున్నాయి. హిట్లర్ భావజాలం పట్ల నేటి తరం ఆకర్షితులవుతున్నారు. అనేక దేశాల్లో హిట్లర్ ఒక హీరోగా యువతను…

Read More

తెలుగు తెరపై ‘ఉత్తరాధి’పత్యం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమ… ఒకప్పుడు తెలుగు భాష, సంస్కృతి, జీవన విధానాన్ని తెరపై చాటి గర్వంగా తలెత్తుకుంది. ఏటా 100-150 చిత్రాలతో బాక్సాఫీస్‌లో బాలీవుడ్‌తో సమానంగా పోటీపడిన ఈ పరిశ్రమ, ఇప్పుడు ఉత్తరాది నటుల ఆధిపత్యం ముందు గిలగిలలాడుతుంది. తమన్నా, కాజల్ అగర్వాల్, సోనూ సూద్, బాబీ డియోల్, సునీల్ షెట్టి, శ్రద్ధా కపూర్, అనన్య పాండే, రకుల్ ప్రీత్ సింగ్ వంటి ఉత్తరాది సినీ తారలు టాలీవుడ్‌ను సాంస్కృతికంగా…

Read More

హిందువులే లక్ష్యంగా రక్తపుటేరు

సహనం వందే, జమ్ము కాశ్మీర్‌: మతాన్ని అడ్డుపెట్టుకొని మారణ హోమం జరిగింది. హిందూమతమే లక్ష్యంగా ఆ మత ప్రజలను ఉగ్రవాద సంస్థ ఊచకోత కోసింది. మంగళవారం పహల్గామ్ రక్తంతో తడిసిపోయింది. అనంత్‌నాగ్ జిల్లాలోని ఈ ప్రశాంతమైన లోయలో ఉగ్రవాదులు జరిపిన దారుణ దాడిలో హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి మనీష్‌ రంజన్‌తో సహా 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 20 మందికి పైగా గాయపడటంతో విషాదఛాయలు అలుముకున్నాయి. 2019లో పుల్వామాలో జరిగిన…

Read More

భాస్కర మెడికల్ కాలేజీలో ఇంటర్న్‌ల వేదన

సహనం వందే, హైదరాబాద్: మొయినాబాద్‌లోని భాస్కర మెడికల్ కాలేజీ (బీఎంసీ) ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు నెలకు కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే స్టైపెండ్‌గా చెల్లిస్తోందని ఆరోపిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి ఫిర్యాదు అందింది. కళాశాల యాజమాన్యం ఇందుకు సంబంధించి 2003 నాటి పాత ప్రభుత్వ ఉత్తర్వును చూపుతూ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ఎన్‌ఎంసీ గత కొద్ది నెలలుగా తెలంగాణ వైద్య విద్యా సంచాలకుల (డీఎంఈ) దృష్టికి తీసుకెళ్లినా, ఎలాంటి చర్యలు…

Read More

సివిల్స్‌లో మహిళా ‘శక్తి’

సహనం వందే, హైదరాబాద్‌ సివిల్‌ సర్వీసు అర్హత పరీక్షల్లో మహిళలు సత్తా చాటారు. ఆలిండియా టాపర్‌తో పాటు ఆలిండియా రెండో ర్యాంకును నారీమణులు కైవసం చేసుకున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆలిండియా టాపర్‌గా నిలిచారు. రెండో స్థానంలో హర్షిత గోయల్, మూడో స్థానంలో డోంగ్రె అర్చిత్‌ పరాగ్‌ ఉన్నారు. తొలి మూడు ర్యాంకుల్లో ఇద్దరు మహిళలే కావడం గమనార్హం. సివిల్‌ సర్వీసు ఉద్యోగాలకు సంబంధించి తాజాగా విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 1009…

Read More